కొరివితో గోక్కోవడం అంటే ఇదే.. జనసేన ఎమ్మెల్యే వివాదం!
“రంగాను ప్రభుత్వంతోనే చంపించారు.” అని సంచలన వ్యాఖ్యలు కొరివితో తలగోక్కోవడం.. లేనిపోని బురదను తాము అంటించుకుని పార్టీకి కూడా అంటించడం.. ఇటీవల కాలంలో ఏపీలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలకు అలవాటుగా మారిపోయింది. గత ఆరు మాసాల నుంచి ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా వివాదాలను తమ చుట్టూ తిప్పుకొంటున్నారు. ఒకవైపు.. టీడీపీ ఎమ్మెల్యేలు దారి తప్పుతున్నారని.. సీఎం చంద్రబాబు లబోదిబోమంటున్నవిషయం తెలిసిందే. వ్యక్తిగత విమర్శలు, పార్టీలపై విమర్శలు చేయొద్దని ఆయన చెబుతున్నారు. ఇక, ఇప్పుడు జనసేన వంతు…
