మా ట్రాక్టర్లే ఆపుతావా అంటూ ఏకంగా ఎమ్మార్వో ఆఫీసుకు తాళం వేసిన కాంగ్రెస్ పార్టీ యువకుడు, ట్రాక్టర్ డ్రైవర్లు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం చిల్పూర్ గుట్టలోని ఎమ్మార్వో కార్యాలయం ముందు నుండి కొంతమంది ట్రాక్టర్ డ్రైవర్లు మైనింగ్ చేసిన మట్టి తరలిస్తుండగా, ఆర్ఐ చీకటి వినీత్ కుమార్ మరియు ఇతర సిబ్బంది మట్టిని ప్రభుత్వ అనుమతితోనే తరలిస్తున్నారా అని ట్రాక్టర్ డ్రైవర్లను ప్రశ్నించారు


స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అక్రమంగా మైనింగ్ రవాణాను ప్రశ్నించినందుకు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక యువకుడి అండతో ఎమ్మార్వో కార్యాలయానికి తాళం వేసి, సిబ్బందిపై దాడికి ప్రయత్నించిన ట్రాక్టర్ డ్రైవర్లు
దీంతో ఆగ్రహించిన ట్రాక్టర్ డ్రైవర్లు అధికార కాంగ్రెస్ పార్టీ యువకుడికి సమాచారం ఇవ్వగా, ఎమ్మార్వో కార్యాలయానికి తాళం వేసి సిబ్బందిపై దాడికి ప్రయత్నించారు
కాంగ్రెస్ పార్టీ అండతోనే అక్రమంగా మైనింగ్ రవాణా జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు
ఎమ్మార్వో సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ముగ్గురు ట్రాక్టర్ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు