భూ సమస్యలకు మళ్లీ అప్లై చేయాల్సిందేనా?

రాష్ట్రంలోని భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం భూ భారతి పోర్టల్‌ను తీసు కొచ్చిన విషయం తెలిసిందే. దీంతో భూ సమస్యలపై ధరణిలో చేసుకున్న అప్లికేషన్లను రిజెక్ట్​ అవుతున్నాయి.

భూ భారతి పోర్టల్ అందుబాటులోకి రావడం, అలాగే, కొత్త ఆర్​వోఆర్​ చట్టం అమల్లోకి రావడంతో పాత దరఖాస్తులు తిరస్కర ణకు గురవుతున్నాయి. దరఖాస్తుదారులు భూ భారతి పోర్టల్​లోనే మళ్లీ అప్లికేషన్​ పెట్టుకోవాలని అధికారులు అంటున్నారు.

త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా రెవెన్యూ సద స్సులు నిర్వహిస్తున్నామని, అందులోనూ మాన్యువల్​గా దరఖాస్తులు చేసుకోవ చ్చని అన్నారు. తెలంగాణ లో భూ భారతి పోర్టల్​ను తీసుకొచ్చే సమయానికి ధరణిలో 81,000కుపైగా దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయి.

ధరణిలోని పెండింగ్​ దరఖాస్తులను భూ భారతి పోర్టల్​కు బదిలీ చేశారు. భూ భారతి చట్టం తీసుకురావడంతో పాటు తహసీల్దార్​, అడిషనల్​ కలెక్టర్​, ఆర్డీవో, కలెక్టర్ స్థాయుల్లో అధికారాలను వికేంద్రీకరించడంతో చిన్నపాటి సమస్యలలు తహసీల్దార్​, ఆర్డీవో స్థాయిలోనే పరిష్కారం అవుతాయి.

దీంతో ధరణిలోని పెండింగ్​ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లను సర్కారు ఆదేశించింది. అయినప్పకటికీ అధికారు లు కారణాలు చెప్పకుండా నే పాత దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రిపోర్ట్​లు సైతం పెట్టకుండానే తిరస్కరిస్తు న్నట్లు తెలుస్తోంది.

గతంలో పరిష్కారం కాని తమ భూ సమస్యలు ఇప్పుడైనా పరిష్కారం అవుతాయని చాలామంది రైతులు ఇప్పుడు దరఖా స్తులు చేసుకుంటున్నారు. పెట్టుకుంటున్నారు.

భూ భారతి పోర్టల్​లో దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తు ను భూ భారతి చట్టంలోని నిబంధనల​ కిందే పరిష్కరించాల్సి ఉంది. ఏ దరఖాస్తును తిరస్కరిం చినా సరైన కారణం చెప్పాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!