బెట్టింగ్ యాప్స్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన విష్ణుప్రియ

బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ వివాదంలో దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీల పేర్లు తెర మీదకు వచ్చాయి.

వారితో పాటు పలువురు నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిలో భాగంగానే యాంకర్ విష్ణుప్రియతో పాటు పలువురు సెలబ్రిటీల మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

విష్ణుప్రియ ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసేవిధంగా విపరీతంగా పోస్టింగ్‌లు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం పోలీసులు ఆమెను విచారించారు. విష్ణుప్రియ మొబైల్ కూడా సీజ్ చేశారు.

error: Content is protected !!