లండన్ నుంచి ఇంటర్నెట్ కాల్ చేసిన నిందితుడు అఖిలే్షరెడ్డి రూ.20 లక్షలు ఇవ్వకపోతే.. చంపేస్తానంటూ బెదిరించాడంటూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత ఏడాది సెప్టెంబరు 29న కొత్తపల్లి(కరీంనగర్ జిల్లా) పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.
చట్టప్రకారం కేసు దర్యాప్తు కొనసాగించాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో బీఎన్ఎ్సఎ్స-35 (సీఆర్పీసీ 41ఏ) ప్రొసీజర్ను పరిశీలించకుండా యాంత్రికంగా నిందితుడిని రిమాండ్కు పంపిన కరీంనగర్ మొదటి అదనపు జ్యుడీషియల్ మెజిస్ర్టేట్తోపాటు దర్యాప్తు అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.