నిత్య పెళ్లికూతురిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు..
12 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురిపై అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావుకు సోమవారం బాధితులు ఫిర్యాదు చేశారు.అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం గ్రామానికి చెందిన బేతి వీర దుర్గ నీలిమ, ఆమె తల్లి బేతి వీరలక్ష్మి, రామకృష్ణ, కళ్యాణ్ లు ఆర్థిక స్థిరత్వం కలిగి విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్ గా చేసుకుని మోసం చేస్తున్నారు. సెక్షన్ 498 కేసులు ఎదుర్కొంటున్న పురుషులు వీరు చేసిన మోసాలకు బలవుతున్నారు. విడాకులు తీసుకుని డిప్రెషన్ లో…
